Thursday, February 18, 2016

జంతికలు

బియ్యం - 1 కె.జి
మినప్పప్పు - 1 కప్పు
వాము -  చారెడు
ఉప్పు -  సరిపడా
పచ్చి కారం - 2 టీ స్పూనులు
నువ్వులు - 50 గ్రా.
                                         బియ్యం శుభ్రంగా కడిగి ఎండ పోయాలి.పొట్టులేని మినప్పప్పు వేయించి ఈరెండు కలిపి మర పట్టించి ఒక డబ్బాలో పోసుకుని ఎప్పుడంటే అప్పుడు కొంచెం పిండితో అయినా వండుకోవచ్చు.అప్పుడు షుమారుగా పై కొలతలు వచ్చేలా పిండి కలుపుకోవాలి.పిండి కలిపేటప్పుడు కొద్దిగా కాగిన నూనె పోసి నేలలతో కొద్దికొద్దిగా కలుపుకోవాలి.అప్పుడు రుచిగా కరకరలాడుతూ బాగుంటాయి.నూనెలో వేగుతాయి కనుక పచ్చి నువ్వులు కలుపుకోవాలి. 

No comments:

Post a Comment