Sunday, February 14, 2016

పాయసం

బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 చారెడు
బెల్లం - 1 కప్పు
పంచదార - కొంచెం
పాలు - 1 లీటరు
నీళ్ళు - 1/2 లీటరు
యాలకులపొడి - 1/4 టీ స్పూను
జీడిపప్పు - 10
కిస్మిస్ - 10
 నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
                                                                          ముందుగా బియ్యం,పెసరపప్పుశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో 1/4 గం.నానబెట్టాలి.మందపాటి గిన్నెలో పాలు,నీళ్ళు పోసి పొంగు రాగానే కడిగి   పెట్టుకున్న బియ్యం,పెసరపప్పు వేసి బాగా ఉడికించాలి.రైస్ కుక్కర్లో అయితే కాగిన పాలు పోసి బియ్యం,పప్పు వేసేస్తే మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే సరిపోతుంది.దేనిలో అయినామెత్తగా ఉడికిన తర్వాత తురిమిన బెల్లం,కొంచెం పంచదార,యాలకుల పొడి వేసి తిప్పాలి.స్టవ్ వెలిగించి చిన్న నాన్ స్టిక్ పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి పాయసంలో కలుపుకోవాలి.ఎంతో మధురమైన పాయసం తయరయినట్లే.కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment