రొయ్యలు - 1/4 కె.జి
గోధుమ పిండి - 1/2 కె.జి
బీన్స్,కారట్ కలిపి - 1/2 కప్పు
బంగాళ దుంపలు - 1
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చిమిర్చి - 2
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
గోధుమ పిండి - 1/2 కె.జి
బీన్స్,కారట్ కలిపి - 1/2 కప్పు
బంగాళ దుంపలు - 1
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చిమిర్చి - 2
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
పిండి:గోధుమ పిండిలో కొంచెం ఉప్పు,నూనె వేసి సరిపడా నీళ్ళు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకుని కొంచెం సేపు నానబెట్టాలి.
స్టఫింగ్ కోసం:రొయ్యలు ఉప్పు,పసుపు వేసి ఉడికించి సన్నగా ముక్కలు కొయ్యాలి.కొంచెం నూనె వేసి సన్నని ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,అల్లం,వెల్లుల్లి పేస్ట్,రొయ్యలు వేసి వేయించాలి.తర్వాత కారట్,బీన్స్ తురుము వేయాలి.బంగాళదుంప ఉడికించి మెత్తగా చేసి వేసి వేయించి ఉప్పు,గరం మసాలా,కొత్తమీర వెయ్యాలి.చివరగా నిమ్మరసం 1 స్పూను వేసి కలిపి చల్లార్చాలి.
సమోసా:చపాతీ చేసి మధ్యకు కట్ చేసి ముక్కోణపు ఆకారంలో మడిచి లోపల మిశ్రమం పెట్టి నీళ్ళతోఅంటించాలి. అన్నీ తయారు చేసుకుని మధ్య రకం మంటపై వేయించుకోవాలి.అంతే నోరూరించే రుచికరమైన రొయ్యల సమోసా తయారయినట్లే.
No comments:
Post a Comment