పెసర పప్పు - 1/4 కప్పు
ఖర్జూరాలు - 5
బియ్యపు రవ్వ - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1/2 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 1/4 కప్పు
కొబ్బరి పాలు - 1 1/2 కప్పు
పంచదార - 1 కప్పు
మొక్కజొన్న పిండి - 1/2 స్పూను
మొక్కజొన్న పిండి - 1/2 స్పూను
నెయ్యి - 2 టేబుల్ స్పూనులు
ఉప్పు - చిటికెడు
యాలకుల పొడి - 1/4 స్పూను
జీడిపప్పు,ఎండు ద్రాక్ష కలిపి - ఒక 1/4 కప్పు
ముందుగా పెసర పప్పు ఖర్జురాలను ఒక గం.ముందు నానబెట్టుకోవాలి. ఖర్జురాలను గింజలు తీసి మిక్సీలో వేసి 1 1/2 కప్పు అయ్యేలా నీళ్ళు చేర్చుతూ చిక్కటి రసం తీయాలి.స్టవ్ వెలిగించి బాండీలో కొద్దిగా నెయ్యి వేసి బియ్యపు రవ్వ,బియ్యప్పిండి దోరగా వేయించుకోవాలి.ఖర్జూర రసాన్ని ఒకగిన్నెలో పోసి ఉప్పు వేసి మరిగించాలి.ఇందులో పెసరపప్పు,వేయించి పెట్టుకున్నబియ్యప్పిండి,రవ్వ వేసి కలిపిన తర్వాత కొబ్బరి తురుము వేసి దగ్గరకు రానిచ్చి దింపేయాలి.కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసి 5 ని.లు ఆవిరిపై ఉడికించాలి.మరో గిన్నెలో కొబ్బరిపాలు తీసుకుని పంచదార కలిపి పొయ్యి మీద పెట్టి మరిగేటప్పుడు ఉండ్రాళ్ళు వేయాలి.ఒక 5 ని.లు అయ్యాక ఒక స్పూను నీళ్ళల్లో మొక్కజొన్న పిండి వేసి కలిపి పాయసంలో వేసి తిప్పాలి.జీడిపప్పు,ద్రాక్ష నేతిలో దోరగా వేయించుకుని మిగిలిన నెయ్యి,యాలకులపొడి వేసి ఒకసారి తిప్పి దింపేయాలి.అంతే ఘుమఘుమలాడే నోరూరించే ఉండ్రాళ్ళ పాయసం సిద్ధం.
No comments:
Post a Comment