పూర్ణం తయారీకి :
పచ్చి శనగపప్పు /పెసరపప్పు - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
వేయించిన నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
వేయించిన కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
యాలకుల పొడి -- 1 స్పూను
పూర్ణం పైన పెట్టడానికి:
బియ్యప్పిండి - 2 కప్పులు
మంచినీళ్ళు - మూడు కప్పులు
నెయ్యి -1 స్పూను
ఉప్పు - కొద్దిగా
పచ్చి శనగపప్పు /పెసరపప్పు - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
వేయించిన నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
వేయించిన కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
యాలకుల పొడి -- 1 స్పూను
పూర్ణం పైన పెట్టడానికి:
బియ్యప్పిండి - 2 కప్పులు
మంచినీళ్ళు - మూడు కప్పులు
నెయ్యి -1 స్పూను
ఉప్పు - కొద్దిగా
పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించి గరిటెతో పప్పును మెత్తగా చేసి దానిలో బెల్లం తురుము,వేయించిన కొబ్బరితురుము,నువ్వులపొడి వేసి నీరు ఇగిరి పోయేంత వరకు తిప్పాలి.ఒక పక్కనపెట్టి ఆరిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి కొద్దిగా ఉప్పు,నెయ్యి వేసి కలపాలి.దానిలో ఉండలు కట్టకుండా బియ్యప్పిండి వేసి తిప్పుతూ దగ్గరకు వచ్చి ముద్దలా అయిన తర్వాత దించేయాలి.ఆరిన తర్వాత ఈ పిండిని చిన్న పురీల్లా వత్తి దానిలో పూర్ణం పెట్టి మూసేసి గుండ్రంగా చేయాలి.అన్నీ ఇలాగే తయారు చేసుకుని ఇడ్లీ కుక్కర్ లో ఆవిరి మీద ఒక 5 ని.లు ఉడికించాలి.
No comments:
Post a Comment